
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 రోజును ఆప్షనల్ హాలిడేగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ తీవ్ర అభ్యంతరం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ హాలిడేను వెంటనే పబ్లిక్ హాలిడే మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ సి సి గేటు దగ్గర రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు శాంతియుతంగా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.
ఎవరికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా తమ నిరసన తెలియజేస్తున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేసి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ ప్రజల పట్ల చాలా దాహిష్టంగా ప్రవర్తిస్తుందని, నిరసన కారులపై విచక్షణరహితంగా దాడిగా పాల్పడుతున్నారని విమర్శించారు.
మహిళలు అని కూడా చూడకుండా పక్కకు లాగివేయడంతో తీవ్ర ఉద్రిక్తత రేగింది. ఈ దాడిని ఖండిస్తూ బీజేపీ గిరిజన డాక్టర్ కళ్యాణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూసంత్ సేవలాల్ మహరాజ్ గారి జయంతిని పబ్లిక్ హాలిడే గా మార్చాలని, అలాగే మాన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి ఫిబ్రవరి 22 కూడా ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రకటించి, గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బంజారాహిల్స్ లో శ్సంత్ సేవాలాల్ మహారాజ్ 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి, దానిలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని కోరారు. దానితో పాటు హైదరాబాద్ సెంటర్లో మాన్యం వీరుడు కొమురం భీం 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో గిరిజనుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజనుల డిమాండ్లను సాదించేదాకా తమ పోరాటం ఆగదని, దీన్ని ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని తెలిపారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్