
గత కొన్ని రోజుల నుండి చైనాలో నుమోనియా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ లోని పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. దాదాపు ఆరు రాష్ట్రాల్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అలర్ట్లో పెట్టారు. చైనాలోని పిల్లల్లో శ్వాసకోస వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాస్పిటళ్లను సిద్ధం చేశారు. హెల్త్ కేర్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది.
కర్ణాటక ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రజలను వారించింది. సీజనల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సీజనల్ ఫ్లూ లక్షణాలు, రిస్క్ గురించి ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా లేకున్నా మెడికల్ సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది.
More Stories
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి