
తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తరుపున ప్రమోద్ దూబే, సీఐడీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదనల అనంతరం కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ నుంచి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్మెంట్లను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించారని ఆధారాలు చూపించారు. ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు.
సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని కోరారు. చంద్రబాబు రిమాండ్ను పొడగించాలని, 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేశారు. మరోవైపు, ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ విషయంలో ఇరువైపులా న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించాచారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం