
ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఏర్పడిన వరద పరిస్థితులను వివరించామని తెలిపారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని అమిత్ షా చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేంద్ర బృందం తెలంగాణ కు చేరుకుంటుంది. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు.
“సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా పథకం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ భీమా పథకం అమలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు” అంటూ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రైతులకు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరదల విషయం తెలియగానే కేంద్రమంత్రి అమిత్ షాతో మాట్లాడాగా ఆయన వెంటనే రెండు ఆర్మీ హెలికాప్టర్లను, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారని తెలిపారు. రూ. 900 కోట్లకు పైగా గల ఎస్డీఆర్యేఫ్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించవచ్చని ఆయన తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్ కింద మృతులకు రూ. 4లక్షల రూపాయలు ఇవ్వొచ్చని కిషన్ రెడ్డి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కాల్వలు కబ్జాలు కావడం, పూడిక తీత పనులు చేయకపోవడం వల్లే వరదలు ముంచెత్తాయని విమర్శించారు. వరంగల్ నగరంలో ప్రతీయేటా వరదలు వస్తున్నాయని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!