2075 నాటికి అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2075 నాటికి అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2075 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తుందని, జపాన్‌, జర్మనీలను మాత్రమే కాకుండా అమెరికాను కూడా అధిగమిస్తుందని తాజా నివేదిక పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకారం, 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్దగా మారడంతో, దాని ఆర్థిక వ్యవస్థ నాటకీయంగా విస్తరిస్తుందని అంచనా వేయబడింది. 
 
జర్మనీ, జపాన్‌, చైనా, యుఎస్‌ల తర్వాత భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ”రాబోయే రెండు దశాబ్దాలలో, భారతదేశ డిపెండెన్సీ రేషియో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో అత్యల్పంగా ఉంటుంది” అని గోల్డ్‌మన్‌ సాక్స్‌ రీసెర్చ్‌  భారతదేశ ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా తెలిపారు.
జిడిపి అనూహ్యంగా పెరిగి, అమెరికాను దాటుకొని 52.5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

వేగంగా పెరుగుతున్న జనాభా సామర్థ్యాన్ని వెలికితీయడం, శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అలాగే దాని అపారమైన ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాలను అందించడం కీలకమని సేన్‌గుప్తా చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యల్ప డిపెండెన్సీ నిష్పత్తులలో ఒకటిగా ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు. 

”తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలలో భారతదేశం సరైన అవకాశాలు పొందడానికి అనుగుణంగా ఉంటుంది” అని సేన్‌గుప్తా చెప్పారు. పడిపోతున్న డిపెండెన్సీ నిష్పత్తులు, పెరుగుతున్న ఆదాయాలు, లోతైన ఆర్థిక రంగ అభివృద్ధితో, అనుకూలమైన జనాభాల కారణంగా భారతదేశ పొదుపు రేటు పెరుగుతుందని భావిస్తున్నారు.

“ఈ విషయంలో, ప్రభుత్వం ఇటీవలి కాలంలో భారీ లిప్టిగ్‌ చేసింది. కానీ భారతదేశంలోని ప్రైవేట్‌ కార్పొరేట్లు, బ్యాంకుల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీట్లను బట్టి, ప్రైవేట్‌ రంగ క్యాపెక్స్‌ సైకిల్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము” అని నివేదిక పేర్కొంది. అదే సమయంలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరగకపోతే భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ప్రతికూల ప్రమాదం అవుతుందని నివేదిక హెచ్చరించింది.