ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్ర చెప్పడం ప్రాధాన్యత సంచరించుకుంది. ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ముడిసరకు ధరలు సైతం పెరగడంతో దేశీయ చమురు సంస్థలపై ప్రభావం పడింది. అయితే.. అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ విషయంలో చమురు సంస్థలకు లాభాలే వచ్చినప్పటికి, డీజిల్ విషయంలో భారీ నష్టాన్ని చూశాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. నష్టాలను కవర్ చేసుకునేందుకు ఇంకా ప్రైజ్ కట్ ప్రకటించలేదు.
“నష్టాల నుంచి బయటపడితే.. ధరలు దిగిరావాలి. పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకుండా ఉండాలని చమురు సంస్థలకు ప్రభుత్వం చెప్పలేదు. వారి సొంతంగానే అలా చేశారు,” అని హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. చమురు సంస్థలు ప్రస్తుతం లీటరు పెట్రోల్పై రూ. 10 లాభాన్ని అర్జిస్తున్నట్టు తెలుస్తోంది. లీటరు డీజిల్పై రూ. 6.5 నష్టపోతున్నట్టు సమాచారం.
“2022 జూన్ 24తో ముగిసిన వారంలో.. చమురు సంస్థలు రికార్డు నష్టాన్ని చూశాయి. లీటరు పెట్రోల్పై రూ. 17.4, లీటరు డీజిల్పై రూ. 27.7 నష్టపోయాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 2022 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో లీటరు పెట్రోల్పై చమురు సంస్థలు రూ. 10 లాభాన్ని అర్జించాయి. డీజిల్పై నష్టాలు కూడా దిగొచ్చాయి. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో లీటరు డీజిల్పై రూ. 6.5 నష్టాన్ని నమోదు చేశాయి,” అని ఇటీవలే బయటకొచ్చిన ఓ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.6గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 89.62గాను, లీటరు పెట్రోల్ ధర రూ. 96.72గా కొనసాగుతోంది.
More Stories
నెస్లేపై విచారణకు ఆదేశించిన కేంద్రం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
మరోసారి అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి