హిందూ మహా సముద్ర జలాల్లోకి మరో చైనా గూఢచారి నౌక

భారత్‌ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు కొద్దిరోజుల ముందే చైనా మరో గూఢచారి నౌకను హిందూ మహా సముద్ర జలాల్లోకి పంపింది. శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులోని ఇలాంటి ఓడ వచ్చి చేరిన మూడు నెలలకు ఇది జరిగింది.  రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, భారత నౌకాదళం చాలా రోజులుగా చైనా గూఢచారి నౌక యువాన్‌వాంగ్‌  కదలికను చురుకుగా ట్రాక్‌ చేస్తోంది.

ఓడల కదలికను ట్రాక్‌ చేసి ఆన్‌లైన్‌ సేవ అయిన మెరైన్‌ ట్రాఫిక్‌ సూచించినట్లు బాలీ తీరంలో ప్రయాణిస్తోంది. చైనా నావికాదళం ఈ జలాల్లో మోహరించిన గూఢచారి నౌకలు సోదరి నౌకలు. క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పర్యవేక్షించడానికి రూపొందించబడ్డాయి. ఇప్పుడు తాను పరీక్షించబోయే క్షిపణిని ట్రాక్‌ చేయడానికి చైనా ప్రయత్నిస్తుండవచ్చని భారత్ ఆందోళన చెందుతున్నది.

ఈ ప్రక్రియలో క్షిపణి పథం, వేగం, పరిధి, ఖచ్చితత్వం వంటి దాని సామర్థ్యాల గురించి కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. నిర్ణీత క్షిపణి పరీక్ష శ్రేణి అయిన వీలర్‌ ద్వీపం నుండి భారతదేశం తరచుగా బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో ఈ నౌకకు చెందిన మరొక నౌక యువాన్‌వాంగ్‌ క్షిపణి చైనా సముద్రానికి తిరిగి రావడానికి ముందు శ్రీలంలోని హబన్‌టోటా ఓడరేవులో దిగింది.

భారతదేశం ఆందోళన యువాన్‌వాంగ్‌ తరగతికి చెందిన ఓడల విస్తరణపై మాత్రమే కాదు. శ్రీలంక తన అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోవడంతో చైనా మర్చంట్‌ పోర్ట్‌ హోల్డింగ్స్‌ కు 99 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చిన హంబన్‌తోట పోర్ట్‌ పై కూడా దృష్టి సారించాయి. ఇది సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం నిరంతర భయాలకు దారితీసింది.