భారత దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన మరుసటి రోజుననే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది ప్రయోగించనున్న మొదటి భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ కు సంబంధించిన ఓ కీలక పరీక్షను శనివారం విజయవంతంగా జరిపింది.
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని బాబినా ఫీల్డ్ ఫైర్ రేంజ్ నుంచి మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టమ్ “ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐఎంఎటి)ని విజయవంతంగా జరిపారు. ఈ పరీక్ష భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఎంతో కీలకం అని తెలుస్తోంది.
క్రూ మాడ్యూల్ బరువుకు తగ్గ 5-టన్నుల డమ్మీ బరువుని 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళపు ఐఎల్-76 ఎయిర్క్రాఫ్ట్ ద్వారా కిందికి జారవిడిచారు. రెండు చిన్న పైరో-ఆధారిత మోర్టార్-నియోగించిన పైలట్ పారాచూట్లు, ఆపై ప్రధాన పారాచూట్లను లాగారు.
గగన్యాన్ క్రూ మాడ్యూల్ కోసం పారాచూట్ సిస్టమ్ మొత్తం 10 పారాచూట్లను కలిగి ఉంటుంది.
విమానంలో పారాచూట్ సీక్వెన్స్ 2 సంఖ్యల అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచూట్ల (క్రూ మాడ్యూల్ పారాచూట్ కంపార్ట్ మెంట్కు రక్షణ కవర్) విస్తరణతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత వేగాన్ని స్థిరీకరించడానికి , తగ్గించడానికి 2 నంబర్ల డ్రోగ్ పారాచూట్ విస్తరణ జరుగుతుంది అని ఇస్రో అధికారులు చెప్పారు. వ్యోమగాములను భూమిపైకి దింపేందుకు మూడు ప్రధాన పారాచూట్లలో రెండు సరిపోతాయని, మూడవది అనవసరమని భారత అంతరిక్ష సంస్థ పేర్కొంది.
అదే సమయంలో చిన్న పారాచూట్లు, ప్రధాన పారాచూట్ల కోసం ఎయిర్క్రాఫ్ట్.. హెలికాప్టర్ల కోసం రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ పరీక్షలను ఉపయోగించి ప్రతి పారాచూట్ పనితీరును సంక్లిష్టమైన పరీక్షా పద్ధతుల ద్వారా అంచనా వేయనున్నారు. ఓ పరీక్షలో ఒక ప్రధాన పారాచూట్ ఓపెన్ కావడంలో విఫలమైనప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కనుగొన్నారు.
పారాచూట్ సిస్టమ్ వివిధ ఫెయిల్యూర్ సిచ్యుయేషన్స్ని పరిశీలించడానికి ఈ పరీక్ష జరిపారు.అందులో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం ఈ ప్రయోగం అంతా దాదాపు 2-3 నిమిషాల పాటు కొనసాగింది. పేలోడ్ ద్రవ్యరాశి నేలపై మెత్తగా ల్యాండ్ అయినందున మెయిన్ పారాచూట్లు పేలోడ్ వేగాన్ని ఈజీగా ల్యాండింగ్ వేగానికి తగ్గించాయని పరీక్షలో తేలింది.
More Stories
బెంగళూరు, శివమొగ్గలలో ఎన్ఐఎ దాడులు
బిజాపూర్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆప్ నిరసనలతో ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత