5జి తో 2 శాతం పెరగనున్న దేశ డిజిపి

5జి తో 2 శాతం పెరగనున్న దేశ డిజిపి

etఫిఫ్త్​ జనరేషన్​ (5జీ) టెలికం నెట్​వర్క్​లు మన దేశ జీడీపీలో  2 శాతం దాకా పెరుగుదలకు దోహదం చేసే అవకాశం​ ఉందని ఒక నివేదిక  వెల్లడించింది. దీని ప్రకారం 2030 నాటికి జీడీపీలో 5జీ నెట్​వర్క్​ల కంట్రిబ్యూషన్​ 180 బిలియన్​ డాలర్ల దాకా ఉండనుంది. ఆర్థర్​ డి లిటిల్​తో కలిసి ఈ రిపోర్టును నేషనల్​ అసోసియేషన్​ఆఫ్​ సాఫ్ట్​వేర్​ అండ్​ సర్వీసెస్​ కంపెనీస్​ (నాస్కామ్​) తయారు చేసింది. 

 
ఎకానమీ పటిష్టమవడంతో పాటు, రంగాలవారీగా సంస్కరణలూ ఇందుకు దారితీస్తాయని పేర్కొంది.  మన దేశంలో 5 జీ యూజర్ల సంఖ్య 2030 నాటికి 50 కోట్లకు చేరుతుందని, ఈ కారణంగానే ఎకానమీ దిశను మార్చే అవకాశం కలుగుతుందని నాస్కామ్​ రిపోర్టు వివరించింది.
మొబిలిటీ, హెల్త్​కేర్​, మాన్యుఫాక్చరింగ్​, రిటెయిల్​, ఎనర్జీ, యుటిలిటీస్​ వంటి రంగాలలో 5 జీ నెట్​వర్క్​ వాడకం పెరుగుతుందని తెలిపింది. దీంతో మన ఎకానమీకి 180 బిలియన్​ డాలర్ల మేర మేలు జరుగుతుందని ఆర్థర్​ డి లిటిల్​ సౌత్​ ఏషియా మేనేజింగ్​ పార్ట్​నర్​ బర్నిక్​ చిత్రన్ మైత్రా చెప్పారు.  5జీ– అన్​ఫోల్డింగ్​ ఇండియాస్​ ఎరా ఆఫ్​ డిజిటల్​ కన్వర్జన్స్​ పేరుతో తాజా నివేదికను విడుదల​ చేశారు.
టెలికం యూజర్ల విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానం​లో నిలుస్తోంది. దేశంలో 110 కోట్ల మంది యూజర్లుండగా, వీరిలో 74 కోట్ల మంది 4 జీ కస్టమర్లే ఉన్నారు. ఇప్పుడు 5 జీ రాకతో అప్​గ్రెడేషన్​ మరింత ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఏవరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​ (ఆర్పు) రాబోయే కొన్నేళ్లలో బాగా పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది.
టెలికం ఆర్పు 2025 నాటికి రూ. 335 కి చేరొచ్చని పేర్కొంది. స్మార్ట్​ఫోన్ల వాడకంతో పాటు, ఓటీటీ కన్జంప్షన్, డిజిటల్​ పేమెంట్లు, ఈ–కామర్స్​ జోరందుకోవడంతో డిజిటైజేషన్​ వేగంగా సాగుతున్నట్లు వివరించింది. ఇవన్నీ కలిసి ఆర్పు పెరిగేలా సాయపడుతున్నట్లు పేర్కొంది.
దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను కలపడానికి తీసుకొచ్చిన నేషనల్​ ఆప్టికల్​ ఫైబర్​ నెట్​వర్క్​ (ఎన్​ఓఎఫ్​ఎన్​) ప్రాజెక్టు భారత్​నెట్​ వంటి పాలసీలు 5 జీ విస్తరణకు దోహదపడతాయని నాస్కామ్​రిపోర్టు తెలిపింది. 5 జీ ఎక్కువ మందికి చవుకగా చేరేలా ఇలాంటి ప్రాజెక్టులు వీలు కల్పిస్తాయని అభిప్రాయపడింది.
5 జీ సమర్ధంగా వాడుకోవాలంటే దేశం లోని టెల్కోలు, ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎంలు), ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నాస్కామ్​ ప్రెసిడెంట్​ దేవ్​​జాని ఘోష్​ చెప్పారు. అప్పుడే ఎక్కువ మంది వినియోగానికి ముందుకు వస్తారని, ఎక్కువ బెనిఫిట్స్​ లభిస్తాయని పేర్కొన్నారు.
2025 నాటికి గ్లోబల్​గా 5 జీ కనెక్షన్లు 400 కోట్లకు చేరుతాయని అంచనా. మొత్తం కనెక్షన్లలో వాటి వాటా 35 శాతంగా ఉంటుందని చెబుతున్నారు.  అంతేకాదు, 5 జీ మొబైల్​ సబ్​స్క్రిప్షన్లు గ్లోబల్​గా ఏటా 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.