ఒక్క రోజులో 87,000 (87,137) మంది కంటే ఎక్కువ మంది వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా (తాత్కాలిక నివేదికల ప్రకారం దేశం మునుపటి అత్యుత్తమ 87,059 (2014) రికార్డుని అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు.
న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం ద్వారా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన డ్రైవ్ను ప్రారంభించారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్లో ఇది ఒక ముఖ్యమైన విజయం అంటూ డాక్టర్ మాండవ్య తన ట్వీట్లో ప్రశంసించారు:
ఈ దేశవ్యాప్త డ్రైవ్లో మరొక విశేషమైన అంశం ఈ డ్రైవ్ కోసం 6,136 శిబిరాలు నమోదు అయ్యాయి. అలాగే 1.95 లక్షల కంటే ఎక్కువ మంది రక్తదాతలు ఇప్పటివరకు ఈ-రక్త్ కోష్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. link:.https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html
టిబి రోగుల చికిత్స ఫలితాలను మెరుగు పరచడంతో పాటు రోగులకు అదనపు సహాయాన్ని అందించడానికి, అలాగే 2025 నాటికి టిబిని అంతం చేయాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా సమాజ ప్రమేయాన్ని పెంపొందించడంలో, కార్పొరేట్ సామాజిక బాధ్యతను(సిఎస్ఆర్) సద్వినియోగం చేసుకోవడంలో ని-క్షయ్ 2.0 పోర్టల్ సులభతరం చేస్తుంది.
నిక్షయ్ మిత్రులు వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చు. 15,000 కంటే ఎక్కువ మంది ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు. 9.5 లక్షల మంది టిబి రోగులకు సహాయాన్ని అందించడానికి తమ నిబద్ధతను చూపించారు.
More Stories
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత
144 కోట్లకు చేరిన భారత దేశ జనాభా