170 కంటే ఎక్కువ లాభాపేక్షలేని సంస్థలు అమెరికన్ బహుళజాతి సంస్థను తమ అమ్మకాలను నిలిపివేయాలని వత్తిడి తెస్తూ వస్తున్నాయి. బ్లాక్ ఉమెన్ ఫర్ వెల్నెస్ అనే అడ్వకేసీ గ్రూప్ ప్రకటన ప్రకారం. ఉత్తర అమెరికాలోని అరలలో ఉన్న తమ ప్రస్తుత ఉత్పత్తులను రీకాల్ చేయాలని అనేక ప్రముఖ సమూహాలు కూడా ఆ కంపెనీకి విజ్ఞప్తి చేశాయి.
అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్న 22 మంది ఫిర్యాదుదారులకు అనుకూలంగా మిస్సౌరీ అప్పీల్ కోర్టు ద్వారా 2 బిలియన్ల డాలర్ల పరిహారంతో ఇచ్చిన తీర్పుతో సహా ఈ కంపెనీ ఇప్పటికే పలు కేసులలో ఖర్చులు, పరిష్కారాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది.
ఉత్తర అమెరికా వెలుపల టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులను విక్రయించడాన్ని కొనసాగించాలని ఈ కంపెనీ తీసుకున్న “అతి విమర్శనాత్మక, అసమర్థత” నిర్ణయాన్ని ఖండిస్తూ లేబర్ పార్టీ ఎంపీ ఇయాన్ లావెరీ గత సంవత్సరం బ్రిటన్ పార్లమెంట్లో ప్రారంభ-రోజు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వాటాదారుల ఓటును బలవంతం చేసే ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు లావెరీ చెప్పారు.
“ఆస్బెస్టాస్తో కలుషితం చేయడం ద్వారా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని మనకు తెలిసిన ఉత్పత్తులు ఇప్పటికీ ఇంగ్లాండ్ లో లేదా ప్రపంచంలో ఎక్కడైనా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండటం దిగ్భ్రాంతికరమైనది,” అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“ఈ హానికరమైన పదార్ధం ప్రభావాల గురించి తెలిసినప్పటికీ దాని అమ్మకం నుండి మంచి లాభం పొందుతున్న జాన్సన్ & జాన్సన్పై ఎటువంటి చర్య తీసుకున్నా స్వాగతం పలుకుతాను” అని స్పష్టం చేశారు.
More Stories
దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలపై ఈసీ వేటు
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు