దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్లు చెప్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొడుతూ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రోజుననే, రామమందిరంకు వ్యతిరేకంగానే వారు నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు.
‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతి రోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి దాడులు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్ నిరసనలకు దిగింది.’ అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
శుక్రవారమే వారు ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదని అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. 550 ఏళ్ల సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని పేర్కొంటూ అందుకే కాంగ్రెస్ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోందని ఆయన స్పష్టం చేసారు.
ఈ రోజు నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టడం ద్వారా తాము రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకమని కాంగ్రెస్ చెబుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈ విధంగా తన బుజ్జగింపు విధానాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగినట్లు కనిపిస్తోందా? అని అమిత్ షా ప్రశ్నించారు.
More Stories
123 ఏళ్ళ తర్వాత అలీఘర్ యూనివర్శిటీ విసిగా మహిళ
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే
మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు