ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్ఎస్ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు.
చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్న స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని అమెరికా స్పష్టం చేసింది. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
మరోవైపు, తైవాన్కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఘాటుగా స్పందిస్తూ ‘‘నిప్పుతో చెలగాటమాడేవారుదానితోనే నాశనమవుతారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీ చూస్తూ కూర్చోదు.. ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని అమెరికాను మళ్లోసారి హెచ్చరిస్తున్నాం’’ అని హెచ్చరించారు.
కాగా అధికారిక సంబంధాలతో తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా బలంగా విశ్వసిస్తోంది. గతవారం ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఫోన్ కాల్లో కూడా మాట్లాడారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని బాహాటంగానే తప్పుబట్టారు.
అయితే తమకు ఎలాంటి దురుద్దేశం లేదని అమెరికా చెబుతోంది. ఈ పర్యటనతో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. కాగా పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు గెలుపొందాక 1949లో తైవాన్, చైనా వేరు పడ్డాయి. ఒకే దేశంగా కొనసాగుతామని అప్పట్లో ఇరు దేశాలూ చెప్పాయి.
కానీ జాతీయ నాయకత్వం సూచించే ప్రభుత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. అయితే వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో కొన్ని బిలియన్ డాలర్లు ఇరుదేశాలతో ముడిపడి ఉండడం గమనార్హం
More Stories
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు