తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఉప్పల్ చిలుకానగర్లో హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.
రెండేళ్లుగా నర్సింగ్ విద్యార్థిని రాధ కనిపించకుండా పోయింది. రాధ అదృశ్యంపై విశాఖ జిల్లాలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 2017 డిసెంబర్లో విశాఖ జిల్లా పెద్దబయలు పోలీస్ స్టేషన్లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. రాధను నక్సల్స్లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఎన్ఐఎకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై ఎన్ఐఎ కేసు నమోదు చేసింది. పెదబయలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఎ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.
మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్ట్ అనుభంద సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తన కూతురును బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో రాధ తల్లి వెల్లడించింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర స్వప్న శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని వెల్లడించింది.
2017లో వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురుని తీసుకెళ్లారని.. అప్పటి నుంచి ఇంటికి రాధ తిరిగి రాలేదని ఫిర్యాదులో తెలిపింది. 2018 నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి ఉదయ్ అరుణతో కలిసి ఏవోబీలో రాధ పని చేస్తోందని తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్ర నేతలు గాజర్ల రవి, దేవేంద్ర, శిల్ప, స్వప్న పేర్లను ఎఫ్ఐఆర్లో ఎన్ఐఏ చేర్చింది.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్