లోక్ సభలో ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు

లోక్ సభలో ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు

ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం ద‌క్కింది. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా క్లియ‌రెన్స్ పొందింది. ఇవాళ మ‌ధ్యాహ్నంఒ స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం ద‌క్కింది. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి అయ్యింది.

ఇక నుంచి ఓటు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నుకునే వారి నుంచి ఎన్నిక‌ల రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు ఆధార్ నెంబ‌ర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవ‌స‌రం అవుతుంద‌ని మంత్రి రిజిజు తెలిపారు. మూజు వాణి ఓటు ద్వారా బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉద‌యం ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ 2021 బిల్లును మంత్రి రిజిజు ప్ర‌వేశ‌పెట్టారు. ఆ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి.

లోక్‌స‌భ‌లో ఈ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి. బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం త‌ప్ప‌ద‌ని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం ఆధార్‌ను ఓట‌ర్ కార్డుతో అనుసంధానం చేయ‌రాదు అని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ అన్నారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

లోక్‌స‌భ‌లో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ఇవాళ ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఓట‌రు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాల‌న్న ఉద్దేశంతో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును తీసుకువ‌చ్చారు. 
 
ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ప్రతిపక్ష ఎంపీల అభ్యంతరాలను తిరస్కరించిన న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, ఈ సవరణ కేవలం బూటకపు,  మోసపూరిత ఓటింగ్‌ను అరికట్టడానికి మాత్రమే ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీలకు చెందిన ఎంపీలు వెల్‌ ఆఫ్‌ ద హౌస్‌లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. 
 

55 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ డిఎంకె, కాంగ్రెస్ ఎంపిలు నిరసన తెలుపుతుండగా, లఖింపూర్ ఖేరీ హింసలో ఆయన కుమారుడి ప్రమేయంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని టిఎంసి, ఇతర కాంగ్రెస్ ఎంపిలు డిమాండ్ చేశారు.

బిల్లు ఉద్దేశ్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్న న్యాయ మంత్రి, ప్రతిపక్ష ఎంపీలు సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారనిపేర్కొన్నారు.ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా “వివిధ ప్రదేశాల్లో ఒకే వ్యక్తి బహుళ ఓటు నమోదు  ముప్పును అరికట్టడం” పేర్కొన్నారు.  బిల్లు చట్టంగా మారిన తర్వాత ఓటర్ల జాబితాల తయారీ లేదా సవరణకు సంబంధించి అర్హత తేదీలు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో  మొదటి రోజులుగా ఉంటాయి. 

 “1950 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 20, 1951చట్టం లోని సెక్షన్ 60ల సవరణ, “విస్తృత” అనే పదాన్ని “భార్య” అనే పదం స్థానంలో జోడించడం ద్వారా లింగ తటస్థంగా మార్చాలని ప్రతిపాదించారు.
 
బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం త‌ప్ప‌ద‌ని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం ఆధార్‌ను ఓట‌ర్ కార్డుతో అనుసంధానం చేయ‌రాదని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ పేర్కొన్నారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
 
విప‌క్ష నేత‌లు అస‌దుద్దీన్ ఓవైసీ, శ‌శిథ‌రూర్ కూడా ఈ బిల్లును వ్య‌తిరేకించారు. ఆధార్‌ను కేవ‌లం అడ్ర‌స్ ప్రూఫ్‌గా వాడార‌ని, కానీ అది పౌర‌స‌త్వ ద్ర‌వీక‌ర‌ణ ప‌త్రం కాదు అని శ‌శిథ‌రూర్ తెలిపారు. ఓట‌ర్ల‌ను ఆధార్ అడిగితే, అప్పుడు కేవ‌లం అడ్ర‌స్ డాక్యుమెంట్ మాత్రమే వ‌స్తుంద‌ని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హ‌క్కు క‌ల్పిస్తున్న‌ట్లు అవుతుంద‌ని శ‌శిథ‌రూర్ ఆరోపించారు.
 
ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి సూచించారు.  ప్రతిపక్షాల వాదనలు తీవ్రంగా ఖండించిన  కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు.