1971లో భారత్ విజయం చరిత్రనే కాకుండా, దక్షిణ ఆసియా భౌగోళిక స్వరూపంలో మార్పులు తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. సత్యం, న్యాయం వైపే భారత్ ఎప్పుడూ నిలబడుతుందని, యుద్ధం పాకిస్థాన్ సైన్యంతో మాత్రమే కాదని, అన్యాయం, చిత్రహింసలపైనని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్తో విజయం భారత్ విజయం మాత్రమే కాదని, అన్యాయంపై న్యాయం, చెడుపై ధర్మం సాధించిన విజయమని రాజ్నాథ్ అభివర్ణించారు.
బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దానిపై భారత్ ఆధిపత్యం చెలాయించాలని అనుకోలేదని, అక్కడి రాజకీయ శక్తులకు అధికారం అప్పగించిందని గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పాదుకొలపడంలో భారత్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. బంగ్లాదేశ్ గత 50 ఏళ్లలో అభివృద్ధి దిశగా శీఘ్ర పురోగతి సాధిస్తుండటం సంతోషంగా ఉందని, ప్రపంచదేశాలకు కూడా ఇది స్ఫూర్తి అని రక్షణ మంత్రి తెలిపారు.
భారతదేశం ఎన్నడూ ఆక్రమణల కోసం ఇతర దేశాలపై దాడులు చేయలేదనని ఆయన పునరుద్ఘాటించారు. 1971 యుద్ధంలో విజయం కోసం ప్రాణాలర్పించిన మన సైనికులందరికీ శిరసు వంచి అభివందనం చేస్తున్నానని అంటూ ఆయన కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు.
ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతితో దేశం ఒక వీర సైనికునికి, సమర్ధవంతమైన సలహాదారును కోల్పోయిందని రక్షణ మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. 1971 యుద్ధం 50వ వార్షికోత్సవంలో ఆయన లేకపోవడం ఎంతో విచారకరమని చెప్పా అయితే, వార్షికోత్సవానికి ముందే సాయుధ బలగాలను అభినందిస్తూ జనరల్ రావత్ ముందుగానే రికార్డు చేసిన సందేశాన్ని రాజ్నాథ్ ఈ సందర్భంగా అందరితో పంచుకున్నారు.
More Stories
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి
భారత నేవీ చీఫ్గా దినేష్ త్రిపాఠి
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం