తమిళనాడులోని కూనూర్లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ మరో 11 మంది మరణించారు. వెల్లింగ్టన్ (నీలగిరి హిల్స్)లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్లో స్టాఫ్ కోర్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేందుకు సీడీఎస్ బిపిన్ రావత్ బుధవారం మద్యాహ్నం సలూర్ ఎయిర్బేస్ నుంచి హెలికాఫ్టర్లో వెళుతుండగా కూనూర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బిపిన్ రావత్ మరణించారని బుధవారం సాయంత్రం ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్ పేర్కొంది. మరోవైపు సీడీఎస్ బిపిన్ రావత్ మృతి, హెలికాఫ్టర్ ప్రమాదంపై ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.
బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు. జనరల్ బిపిన్ రావత్ అసలు సిసలు దేశభక్తుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. జనరల్ రావత్ గొప్ప ప్రతిభాపాటవాలుగల సైనికుడని బుధవారం ఇచ్చిన ట్వీట్లో పేర్కొన్నారు. మన సాయుధ దళాలను, భద్రతా ఉపకరణాలను ఆధునికీకరించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. వ్యూహాత్మక అంశాల పట్ల ఆయనకు గొప్ప పరిజ్ఞానం ఉందని, ఆయన దృక్పథం, ఆలోచనలు అసాధారణమైనవని పేర్కొన్నారు. ఆయన దివంగతులు కావడం తనను తీవ్రంగా కలచివేసిందని, తాను తీవ్రంగా విచారిస్తున్నానని తెలిపారు.
జనరల్ బిపిన్ రావత్, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 16 డిసెంబర్ 1978న పదాతిదళానికి చెందిన పదకొండవ గూర్ఖా రైఫిల్స్లోని ఐదవ బెటాలియన్లో చేరారు. ఆయన తండ్రి కూడా ఇదే బెటాలియన్ లో పనిచేశారు.
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ నుండి గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు, ఆయన గౌరవనీయమైన ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ను అందుకున్నారు. జనరల్కు విస్తారమైన కార్యాచరణ అనుభవం ఉంది, పోరాట, సంఘర్షణ పరిస్థితులలో విస్తృత సేవలందించారు.
తూర్పు సెక్టార్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఇన్ఫాంట్రీ బెటాలియన్కు, కాశ్మీర్ లోయలోని రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్కు నాయకత్వం వహించారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో చాప్టర్ VII మిషన్లో మల్టీనేషనల్ బ్రిగేడ్కు కమాండ్గా వెళ్లారు. జమ్మూ, కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళ విభాగానికి కమాండ్గా, ఈశాన్య ప్రాంతంలో కార్ప్స్ కమాండర్గా, ఆర్మీ కమాండర్గా, వెస్ట్రన్ ఫ్రంట్తో పాటు ఎడారి సెక్టార్లో కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.
జనరల్ రావత్ అనేక ముఖ్యమైన బోధన, సిబ్బంది నియామకాలను నిర్వహించారు. వీటిలో ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), సీనియర్ ఇన్స్ట్రక్టర్గా జూనియర్ కమాండ్ వింగ్లో బోధనా విభాగాలలో పనిచేశారు. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్, తరువాత మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్లో డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, ఈస్టర్న్ థియేటర్ మేజర్ జనరల్ జనరల్ స్టాఫ్, ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా కూడా పనిచేశారు.
విద్యాపరంగా మొగ్గు చూపిన, జనరల్ నేషనల్ సెక్యూరిటీ, మిలిటరీ లీడర్షిప్పై అనేక కథనాలను రచించారు, ఇవి వివిధ పత్రికలు, ప్రచురణ పొందాయి. మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్లో రెండు డిప్లొమాలు కూడా పొందారు. మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీచే ‘మిలిటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్’పై చేసిన పరిశోధనకు జనరల్కు ‘డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ’ (పిహెచ్.డి) లభించింది.
సైన్యంలో జీవితంలో 42 సంవత్సరాలకు పైగా అందించిన విశిష్ట సేవ, పరాక్రమానికి గుర్తింపుగా జనరల్ బిపిన్ రావత్కు పివిఎస్ఎం, యువిఎస్ఎం, ఎవిఎస్ఎం, వైఎస్ఎం, వైఎస్ఎం వంటి అనేక రాష్ట్రపతి అవార్డులు లభించాయి. ఇవి కాకుండా, ఆయన రెండు పర్యాయాలు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్తో పాటు ఆర్మీ కమాండర్ ప్రశంసలను కూడా పొందారు. కాంగోలో ఐక్యరాజ్యసమితి దళాల్లో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ ప్రశంసలను అందుకున్నారు.
చార్టర్ ఆఫ్ డ్యూటీల ప్రకారం, ప్రధానమంత్రి నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో సిసిఎస్ కూడా సభ్యుడు. త్రివిధ సేనల వ్యవహారాలపై రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. సైబర్స్పే, స్కి సంబంధించిన ట్రై-సర్వీసెస్ ఏజెన్సీలు/సంస్థలు/కమాండ్లు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి.జనరల్ రావత్ సంబంధిత అధికారులకు సేవల సమగ్ర ఇన్పుట్లనుఅందించేవారు. ఆయన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, మరియు డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ సభ్యుడు కూడా. మూడేళ్లలోపు మూడు సేవల మధ్య సమిష్టిగా చేసే కార్యకలాపాలు, లాజిస్టిక్స్, రవాణా, శిక్షణ, సహాయక సేవలు, కమ్యూనికేషన్లు, మరమ్మతులు, నిర్వహణ మొదలైనవి రూపొందించే కృషి చేస్తున్నారు.
More Stories
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
యుద్ధాల వేదికగా మారిన అంతరిక్షం