సిపిఎం అధికారంలో ఉన్న కేరళలోఅధికార పార్టీకి చెందిన ఒక కార్యకర్త.. తనతో పాటే పని చేస్తున్న మహిళ కార్యకర్త నగ్న వీడియోలు తీసి ఆన్లైన్ ప్రచారం చేశాడు. నిందితుడిని చుమంత్రి ఎలిమన్నిల్ సాజిమన్ (39) గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మే నెలలో జరిగిందట. సదరు మహిళను ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేందుకు పాల్పడ్డారు. వారిపై సెక్షన్ 354ఏ (అత్యాచారం), సెక్షన్ 354బీ (మహిళను బలవంతంగా వివస్త్రను చేసి నేరానికి పాల్పడటం), సెక్షన్ 294 (అసభ్యకర చర్యలు) కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా సీపీఏం శాఖ కార్యదర్శి సీసీ సాజిమోన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నేత నాసర్లను చేర్చారు. కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ మహిళను విప్పి ఆమె నగ్న ఫోటోలు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాను ప్లాట్ఫారమ్లలో విస్తృతంగా షేర్ చేశారు.
11 మందిని నిందితులుగా పేర్కొనగా, సాజిమన్ని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన మే 2021లో జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కేసులోని ఇద్దరు ప్రధాన నిందితులు తనను కారులో తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఇద్దరు ప్రధాన నిందితులు తనకు మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చి లైంగికంగా వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, చెల్లించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది.
ఇద్దరు నిందితులు మినహా మిగిలిన వారిపై దుర్వినియోగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసినందుకు కేసు నమోదు చేశారు. వీడియోను సర్క్యులేట్ చేయడంలో ఒక న్యాయవాది కూడా ఉన్నారని ఆమె పేర్కొంది.
More Stories
బెంగళూరు, శివమొగ్గలలో ఎన్ఐఎ దాడులు
బిజాపూర్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆప్ నిరసనలతో ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత