కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు రైతులను గందరగోళంలోకి నెట్టొందని మండిపడ్డారు.  ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడా లేని సమస్యను టీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. 

పంటలపై రాష్ట్ర సర్కార్ దగ్గర సరైన ప్రణాళిక కూడా లేదని ఆయన విమర్శించారు. ఈ సీజన్ లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని స్వయానా సీఎం కేసీఆరే కేంద్రానికి లేఖ ఇచ్చారని ఆయన వెల్లడించారు. 

పుత్రవాత్సల్యం పేరుతో రైతులను బలి చేయవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. దొడ్డు వడ్లు కాకుండా ఇతర ధాన్యాలు లేవా? అని ప్రశ్నించారు. కల్లాల్లో ఉన్న వడ్లన్నీ కొనాలని రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్ర మంత్రి సూచించారు. తెలంగాణాలో నాసిరకం విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని రాష్ట్ర ప్రభుత్వం  అరికట్టలెక పోతున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. 

ముఖ్యమంత్రి  తెలంగాణను ధాన్య బండాగారాన్ని చేస్తా అన్నాడు …మరి ఇప్పుడు ఏమి అయింది? అని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నా వారిని అదుకోడంలో రాష్ట్ర  ప్రభుత్వం వైఫల్యం అయిందని కేంద్ర మంత్రి విమర్శించారు.  చాలా మంది  కౌలు రైతులు ఆత్మహత్యాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతి సంవత్సరం మే నెలలో రైతులు ఏ పంట వేయాలో అనే ప్రణాళిక ఉంటదని, కానీ ఈ ప్రభుత్వనికి ఎలాంటి ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు. ఒకసారి ఒక్కో మాట మాట్లాడుతారని అంటూ ఒకసారి సన్న బియ్యం ..ఒకసారి పత్తి వేయమంటారని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రతి సంత్సరం ధాన్యం కొనుగొలు చేస్తుందని, బాయిల్ రైసు రాకుండా రైతులకు సరైన విత్తనాలు అందుబాటులొ ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి హితవు చెప్పారు. 

హుజూరబాద్ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకొలేకపోతున్నారని పేర్కొంటూ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ప్రజల్ని గందరగోళంలోకి గురి చేసి కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హుజూరబాద్ ఎన్నికల ఓటమిపై కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తప్ప తాము ఏమి చేప్పలేమని పేర్కొన్నారు.