మరీ ముఖ్యంగా భారత జట్టు విదేశాల్లో పర్యటించేటప్పుడు ఆహార ప్రణాళికను చాలాసార్లు పంచుకుంది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ ఇదే జరిగింది. అయితే, ప్రస్తుతం హలాల్ చేసిన మాంసం మాత్రమే ఉండాలని చెప్పడాన్ని బట్టి న్యూజిలాండ్తో తలపడే భారత జట్టులో ముస్లిం ఆటగాడు ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. కాన్పూరు టెస్టు కోసం కివీస్ జట్టు ఆహార ప్రణాళికను పంపింది.
‘‘శిక్షణ, గేమ్స్ కోసం ఆటగాళ్లు అవసరమైన శక్తి, పోషకాలు పొందేందుకు ఆహారంలో ఓ మోస్తరు స్థాయిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ మొత్తంలో కొవ్వు ఉండేలా చూసుకోవాలి. తయారుచేసే ఆహారం వీలైనంత వరకు తాజాగా ఉండాలి’’ అని న్యూజిలాండ్ తన ఆహార ప్రణాళికలో పేర్కొంది. జట్టులోని కొందరు ఆటగాళ్లకు అలెర్జీ ఉందని, కాబట్టి వారి కోసం ప్రత్యేక ఆహారం అవసరమని అందులో పేర్కొంది.
కాగా, ఇండియా, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తర్వాత తొలిసారి టెస్టు సిరీస్లో తలపడబోతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో ఈ టెస్టు సిరీస్కు భారత జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తాడు. డిసెంబరు 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్నరెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉంటాడు.
More Stories
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు
అరుణాచల్లో బీజేపీకి 5 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవం