భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు.
ఈ ప్రాంతం భద్రత విషయంలో భారత దేశం చాలా ముఖ్యమైనది కావడం వల్ల భారత నావికా దళం పాత్ర మరింత ముఖ్యమైనదిగా మారిందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యయం 2023 నాటికి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనా ఉందని గుర్తు చేశారు.
అందువల్ల భారత దేశం తన శక్తి, సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు, స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. పరిశ్రమల అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు, ‘ఫ్లోట్’, ‘మువ్’, ‘ఫైట్’ కేటగిరీలలో స్వదేశీ ఐటమ్స్ను పెంచినందుకు భారత నావికా దళాన్ని అభినందించారు.
ఇప్పటి వరకు సాధించిన విజయాల వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని చెప్పారు. భారత దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే పథకం ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల భారత నావికా దళం 2014లో 76 శాతం ఎయిర్ ఆపరేషన్స్ నెట్, 66 శాతం కాస్ట్ బేసిస్ కాంట్రాక్టులను మన దేశంలోని అమ్మకందారులకు అప్పగించినట్లు రక్షణ మంత్రి తెలిపారు.
నావికా దళ ఆయుధాల్లో 90 శాతం వరకు స్వదేశీ ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం కలిగిందని ఆయన చెప్పారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రాజెక్టు 15బీలో భాగంగా మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక. ఇటువంటి నాలుగు నౌకలను తయారు చేస్తారు. వీటిలో మొదటిదానిని ఆదివారం జల ప్రవేశం చేయించారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు