చైనాలో ముస్లింల‌కు వాట్సాప్‌, జీమెయిల్ నిషేధం

క‌మ్యూనిస్ట్ దేశం చైనాలో ముస్లింల‌పై అరాచ‌కాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. అక్క‌డి ముస్లిం సాంప్ర‌దాయ గ్రూపుల‌కు చెందిన మ‌హిళ‌లు వాట్సాప్‌, జీమెయిల్ అకౌంట్ వంటివి వాడితే.. వారిపై సైబ‌ర్ క్రైమ్స్ చేస్తార‌న్న ముద్ర వేసి నిర్బంధిస్తోంది. ఈ నిబంధ‌నను ఉల్లంఘించిన వారిని ప్రి-క్రిమిన‌ల్స్‌గా అక్క‌డి అధికారులు చెబుతున్నారు. 

“ఇన్ ద క్యాంప్స్‌: చైనాస్ హైటెక్ పీన‌ల్ కాల‌నీ” పేరుతో మంగ‌ళ‌వారం విడుద‌లైన పుస్త‌కం ఈ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. దీనికి వేరా ఝౌ అనే ఓ విద్యార్థిని ఉదంతాన్ని నిద‌ర్శ‌నంగా చూపించింది. ఈమె యూనివ‌ర్సిటీ ఆఫ్ వాషింగ్ట‌న్ విద్యార్థి.

చైనాలో త‌న స్కూల్ హోమ్‌వ‌ర్క్‌ను పంపించ‌డానికి జీమెయిల్ అకౌంట్‌కు లాగిన్ కోసం వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌ను వాడినందుకు ఆమెను నిర్బంధించారు. ఆమెను రీ-ఎడ్యుకేష‌న్ క్లాస్‌కు పంపించారు. ఈ ఘ‌ట‌న 2018లో జ‌రిగింది. ఆరు నెల‌ల పాటు ఆమె ఆ క్యాంప్‌లోనే గ‌డిపింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌న వీధిలో తిరుగుతున్న స‌మ‌యంలో అక్క‌డి మానిట‌ర్లు ఆమెను ముస్లిం ప్రి-క్రిమిన‌ల్‌గా చూపించ‌డం గ‌మ‌నార్హం. అమెరికా పౌర‌స‌త్వం కూడా ఉన్న ఆమె చివ‌రికి 2019లో ఎలాగోలా ఆ దేశానికి వెళ్లిపోయింది.

చైనాలోని నిర్బంధ శిబిరాల‌లో ఇలా 10 ల‌క్ష‌ల మంది ఉయ్‌ఘ‌ర్‌లు, ఇత‌ర ముస్లిం గ్రూపుల‌కు చెందిన వ్య‌క్తులు ఉన్న‌ట్లు అక్క‌డి హ‌క్కుల సంఘాల వాళ్లు వెల్ల‌డించారు. వీళ్ల‌తో బ‌ల‌వంతంగా కూలీ ప‌నులు చేయిస్తున్నార‌ని వాళ్లు ఆరోపించారు. ఝౌతోపాటు మ‌రో 11 మంది ముస్లిం మ‌హిళ‌ల‌ను చైనా అధికారులు అక్క‌డి ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ చ‌ట్టం కింద ప్రి క్రిమిన‌ల్స్‌గా ముద్ర వేశారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం అక్క‌డి ఇంట‌ర్నెట్ ఆప‌రేట‌ర్లు వ్య‌క్తిగ‌త డేటాను కూడా చైనా అధికారుల‌తో పంచుకోవాలి.

ఇలా వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నందుకు ఓ మ‌హిళ‌ను, త‌న ఐడీతో సిమ్ కార్డులు యాక్టివేట్ చేసుకున్న మ‌రో మ‌హిళ‌ను నిర్బంధించారు. చైనాలోని హైటెక్ నిఘా వ్య‌వ‌స్థ వ‌ల్ల అక్క‌డి ముస్లిం మ‌హిళ‌లు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో ఈ తాజా పుస్త‌కం వివ‌రించింది.

చైనా ఇంటర్నెట్ సెక్యూరిటీ చట్టం ప్రకారం, నెట్‌వర్క్ ఆపరేటర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను అధికారులతో పంచుకోవాలి. ఈ గ్రంధం ప్రకారం, వాట్సాప్ డౌన్‌లోడ్ చేసినందుకు మరొక మహిళను అరెస్టు చేయగా, మరొకరు తమ సిమ్ కార్డులను సెటప్ చేయడానికి తన ఐడిని ఉపయోగించడానికి అనుమతించిన తర్వాత మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.  ముగ్గురు మహిళలు చైనా హైటెక్ నిఘా వ్యవస్థ బాధితులు అని ఈ గ్రంథ రచయత  డారెన్ బైలర్ పుస్తక  రాశారు.

చైనా ప్రధాన భూభాగంలో గూగుల్, ఫేస్‌బుక్ లను నిషేధించడంతో జిమెయిల్, వాట్స్ అప్ వంటి వాటి సేవలను ఉపయోగించడం విపిఎన్ ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా చేసినందుకు ఉయిగూర్,  హుయ్ మైనారిటీలకు చెందిన ముస్లిం మహిళలు నెలరోజుల నిర్బంధంకు గురవుతున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం, జింజియాంగ్‌లో మరింత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి.  కొన్ని “రీడ్యుకేషన్” తో పాటుగా వైద్య ప్రయోగాలు, హింసలు జరుగుతున్నాయని, ఈ పద్ధతుల్లో కొన్ని మిలియన్లకు పైగా ఉయిఘర్‌లు గురవుతున్నారని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

2017 నుండి చైనాలో అమలులో ఉన్న చట్టంలో ఇంటర్నెట్ “ప్రీ-క్రైమ్స్” లను నిర్వచారు.  ప్రధాన పాశ్చాత్య సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడంపై నిషేధాన్ని దాటవేయడం, ఇతరుల సిమ్  కార్డులు, ఐడి లను పంచుకోవడం వంటి చర్యలు శిక్షార్హం అవుతాయి.


నిర్బంధ శిబిరాల నుండి విడుదలైన మాజీ ఖైదీలపై చైనా అధికారులు నిఘా ఉంచడం కోసం  థర్మల్ ఇమేజింగ్ కెమెరాల ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్లిష్టమైన, సర్వవ్యాప్త సామూహిక నిఘా వ్యవస్థ ఉపయోగిస్తుంది. వాటిని తయారు చేసే అనేక చైనీస్ కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినప్పటికీ, అమెజాన్ వంటి ప్రైవేట్ కంపెనీలు కరోనా సమయంలో “ఉష్ణోగ్రత పరీక్ష కోసం” పేరుతో కొనుగోలుకు అనుమతించారు.