వివిధ రంగాల్లో సమగ్ర సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు చర్చలు సాగించామని మోడీ మోదీ మీడియా సంయుక్త సమావేశంలో తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు జరిపిన వర్చువల్ సమ్మిట్లో ఇండియా, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ర్టాటజిక్ పార్టనర్షిప్ ఏర్పాటుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
పర్యావరణం పట్ల ఇరుదేశాలకు ఉన్న ఆలోచనా దృక్పథం, చిత్తశుద్ధిని, గౌరవాన్ని ఇది చాటుతుందని చెప్పారు. పునరుత్పాద ఇంధనం, పర్యవారణం, ఎకానమీ, వాతావరణ మార్పు, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకార విస్తరణకు గ్రీన్ పార్టనర్షిప్ అద్దంపడుతుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు.
భారత్ వ్యవసాయ ఉత్పత్తుల పెగుదలకు సంబంధించిన సాగు రంగంలో సమర్ధవంతమైన సప్లయ్ చైన్, స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజిమెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్టు తెలిపారు.
గ్రీన్ గ్రోత్, గ్రీన్ ట్రాన్సిషన్ ఏవిధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలనే దానికి ఇండియా-డెన్మార్ మధ్య సహకారం గొప్ప ఉదాహరణ అని ఫ్రెడరిక్స పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారం పెంచుకునేందుకు ఉభయదేశాలు నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఆమెకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం డేనిష్ ప్రధాని రాజ్ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. భారత్ తో డెన్మార్క్కు బలమైన వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు ఉన్నాయి. భారత్ లో 200కు పైగా డేనిష్ కంపెనీలు ఉండగా, డెన్మార్క్కు 60కి పైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి.
More Stories
ఎడారి దేశం దుబాయ్లో కుండపోత వర్షం
అమెరికాలో భారతీయ విద్యార్థుల పట్ల దౌత్య కార్యాలయాల ప్రత్యేక శ్రద్ద
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కువగా కూల్చింది అమెరికానే