ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కరోనా రెండో వేవ్ కట్టడికి అత్యుత్తమ ఔషధంగా ఉపయోగించిన ప్లాస్మా థెరఫీ వాస్తవానికి కరోనా రోగుల పాలిట మృత్యు వాహనంగా పనిచేసిన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడి అవుతున్నది.
కరోనా రోగులకు దీనిని `అమృతం’గా భావించి, ప్లాజ్మా బ్యాంకుల వద్ద భారీ క్యూలలో, అత్యధిక ధర చెల్లించి రోగుల బంధువులు పడిగాపులు పడ్డారు. అలాగే బాధితులు ఆన్లైన్లో కూడా ప్లాజ్మా దాతల కోసం వెదుకులాట సాగించారు.పోలీసులు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్లాజ్మా దాతల కోసం అన్వేషణ జరిపారు. అయితే తాజాగా ప్లాజ్మా థెరపీపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర వాస్తవాలు వెల్లడయ్యాయి.
ప్లాజ్మా థెరపీ అనేది కరోనా బాధితులకు ఆశించినంత ఉపశమనం కలిగించలేదని, పైగా దీని కారణంగా బాధితుల ఇబ్బందులు పెరిగాయని వెల్లడయ్యింది. ఈ అధ్యయనంలో వెలుగు చూసిన మరో వాస్తవమేమంటే… ప్లాజ్మా థెరపీ కారణంగా కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగిందని తేలింది.
‘కోవలెంట్ ప్లాజ్మా ఫర్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ విత్ కోవిడ్-19: ఓపెన్ లేబుల్, రెండోమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్’ శీర్షికతో సాగించిన అధ్యయనంలో 940 బాధితులను చేర్చారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపులో ప్లాజ్మా చికిత్స చేయించుకున్నవారిని, మరో గ్రూపులో ప్లాజ్మా చికిత్స పొందని వారిని ఉంచారు. ప్లాజ్మా థెరపీ చేయించుకున్న గ్రూపులోని బాధితుల్లో 33.4 శాతం మందిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో పాటు వారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అదే రెండో గ్రూపులోని బాధితులలో 26.4 శాతం మందిలోనే ఇటువంటి సమస్యలు కనిపించాయి. ప్లాజ్మా చికిత్స తీసుకున్నవారిలోని చాలామంది మృత్యువాత పడ్డారు. ప్లాజ్మా థెరిపీ తీసుకున్న బాధితులలో 23 శాతం మంది చికిత్స పొందిన 30 రోజుల లోపునే మృత్యువాత పడ్డారు. మరో గ్రూపులోని 20.5 శాతం మంది బాధితులు మృతి చెందారు. మనదేశంలో కరోనా రెండో వేవ్ సమయంలో ప్లాజ్మా థెరపీపై చర్చ నడిచింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్లాజ్మా థెరపీని నిలిపివేసింది.
More Stories
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత