400 ఏళ్ళ జార్జియా రాణి మరణ మిస్టరీ ఛేదించిన భారతీయ శాస్త్రవేత్తలు

జీవన్ ప్రకాష్ శర్మ 
జార్జియా రాణి సెయింట్ కేటవన్ ను పర్షియా రాజు షా అబ్బాస్ 1624లో హత్యా కావించారా? అందుబాటులో ఉన్న పలు గ్రంధాలు హత్యా జరిపినట్లు నిర్ధారిస్తున్నా ఇరానీయులు ఈ వాదనను ఖండిస్తూ వస్తున్నారు. వారి దృష్టిలో తమ దేశ కెహెరిత్రలో షా అబ్బాస్ అత్యంత ప్రతిభావంతుడైన పాలకుడు. అయితే హత్య జరిగిన్నట్లు నిర్దుష్టమైన ఆధారాలను జార్జియా పాలకులు  ఇప్పటి వరకు ప్రపంచం ముందు ఉంచలేక పోతున్నారు. 
 
అయితే 400 సంవత్సరాల అనంతరం, ఇప్పుడు భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు,  పరమాణు జీవశాస్త్రవేత్తలు ఈ `రహస్యం’ ను చేధించారు. ఆమె హత్యకు గురయ్యారని అంటూ నిర్ధారిస్తూ సేకరించిన ఆధారాలను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ జులై 9న జార్జియా విదేశాంగ మంత్రికి అందించడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. వీరి అద్భుతమైన పరిశోధనను మొత్తం ప్రపంచం ఇప్పుడు కొనియాడుతున్నది. 
 
“ఇది మాకు కేటాయించిన సవాలుతో కూడిన ప్రాజెక్టులలో ఒకటి.   దానిని పూర్తి చేయడానికి మాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది” అని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) చీఫ్ సైంటిస్ట్ కె. తంగరాజ్ చెప్పారు.

ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి?  దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి? ఆశ్చర్యం గానే ఉంటుంది. చరిత్ర ఆధారాల  1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచారు.

1624లో రాణి కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దాంతో ఆమె తీవ్ర హింసకు గురిచేశారు. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు.

వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్‌ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో ప్రపంచం అంతటా దాచారు.

గోవాలో రాణి అవశేషాలు 

ఈ క్రమంలో రాణి కేతేవాన్‌ కుడి చేయిని పాత  గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్‌కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో పాత  గోవా సెయింట్‌ అగస్టీనియస్‌ చర్చి ప్రస్తావన కూడా ఉంది.

అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ప్రస్తుత పరిశోధన 1980ల చివరలో ప్రారంభమై, అనేక విరామాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004లో వివిధ గ్రంధాల  వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను,  ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 

తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్‌ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్‌ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 

“గతంలో, హిమాలయ పర్వతాలలో ఉన్న రూప్కుండ్ సరస్సు కేసులో 800 నుండి 2000 సంవత్సరాల పురాతన మానవ అస్థిపంజరం డిఎన్ఎ ను మేము క్రమం చేసాము, కాని 350 సంవత్సరాల పురాతన రాణి అవశేషాలను ఈ డిఎన్ఎ తీయడం పెద్ద సవాల్ తో కూడుకున్నది” అని తంగరాజ్ వివరించారు. “దీనికి కారణం రూప్‌కుండ్ సరస్సు స్తంభింపచేసిన ప్రాంతం.  అయితే రాణి అవశేషాలు గోవా చర్చిలో చాలా తేమతో కూడిన స్థితిలో చాలా సంవత్సరాలు గోతులు కింద ఉన్నాయి” అని గుర్తు చేశారు. 

ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. 

(అవుట్ లుక్ కధనం ఆధారంగా)