భారత్ ముందు పొంచిఉన్న ‘నార్కో టెర్రర్’ ప్రమాదం 

భారతదేశం ముందు ‘నార్కో టెర్రర్’ అనే మరో ప్రమాదం పొంచి ఉందని, దేశానికి పెను సవాళ్లను విసరనుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఈ సవాళ్లను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు, నార్కో టెర్రర్‌ను దేశంలోకి అడుగుపెట్టనీయకుండా చేయడానికి కేంద్ర కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఉన్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీలో ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఆఫ్ నార్కో డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ సెంటర్‌ను కేంద్ర మంత్రి ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి ఈ కేంద్రాన్ని అనుసంధానించాలనే నిర్ణయం తీసుకున్నట్టు గుర్తు చేశారు.

ఈ యూనివర్శిటీ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో పాటు ఫోరెన్సిక్ సైన్సెస్‌కు సేవలందించే అవకాశాన్ని యువత అందిపుచ్చుకుంటుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారురు. సైబర్ డిఫెన్స్, బారియాట్రిక్ రీసెర్చ్‌లో మనం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తున్నామని చెప్పారు.

నార్కో టెర్రర్ గుప్పిట్లోకి దేశం చిక్కకుండా చూడటం, నిలువరించడం కీలకమని పేర్కొన్నారు. ఇన్వేస్టిగేషన్ వేగవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు శాస్త్రీయ పరికరాలను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోమ్ మంత్రి సూచించారు. ”ఇది థర్డ్ డిగ్రీ శకం కాదు. క్రిమినల్ జస్టిస్ సిస్టంతో ముందుకు వెళ్లాలి. ఇందులో ఫోరెన్సిక్ సైన్సెస్ పాత్ర చాలా కీలకం. శాస్త్రీయ సాక్ష్యాలను ఆధారం చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ ఉండాలి” అని హోం మంత్రి సూచించారు.

దీని వెబ్ సైట్ ప్రకారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం కేసులలో మొత్తం నేరారోపణలను తగ్గించడానికి,  మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడటానికి ఉద్దేశించిన ప్రభుత్వ సంస్థ ఇది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల డేటాబేస్నుబేస్ ను ఒకేచోట అభివృద్ధి చేయడం ద్వారా వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ కేంద్రం ఇతర ప్రభుత్వ సంస్థలకు సహాయం చేస్తుంది.