ప్రముఖ రచయిత, సాహితీవేత్త శ్రీ నరేంద్ర కోహ్లి (81) ఏప్రిల్ 17 రాత్రి సమయంలో మరణించారు. కరోనా పాజిటివ్ తో శుక్రవారం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు.
1940లో పాకిస్తాన్లో జన్మించిన అతని కుటుంబం దేశవిభజన తర్వాత బీహార్కు వలస వచ్చింది. పౌరాణికంగా, చరిత్రాత్మకమైన ఎన్నోగొప్ప రచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
రామాయణం, మహాభారతం వంటి పౌరాణికాల్లోని పాత్రలను ఆధారంగా చేసుకుని సమకాలీక విషయాలపై ఆయన రచనలు చేశారు. మహాభారతంపై ఆయన రచించిన 8అధ్యయనాలు, మహాసమర్(మహాయుద్ధం) వంటివి ఆయన రచనల్లో ఉత్తమ రచనలుగా నిలిచాయి. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు పునరుజ్జీవనంగా ఆయన రచనలు ఉండేవి. నవలలు, వ్యాసాలు 100 కు పైగా పుస్తకాలను ఆయన రాశారు.
శ్రీ నరేంద్ర కోహ్లీ మృతి పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, పౌరాణికంగా ఆయన చేసిన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు.
सुप्रसिद्ध साहित्यकार नरेंद्र कोहली जी के निधन से अत्यंत दुख पहुंचा है। साहित्य में पौराणिक और ऐतिहासिक चरित्रों के जीवंत चित्रण के लिए वे हमेशा याद किए जाएंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 17, 2021
హిందీ సాహిత్యానికి శ్రీ కోహ్లీ ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. అతను మన పౌరాణిక రచనలను ప్రపంచానికి అందించారని తెలిపారు.
प्रख्यात साहित्यकार डॉ. नरेन्द्र कोहली के निधन से बहुत दुख हुआ। हिंदी साहित्य जगत में उनका विशेष योगदान रहा है। उन्होंने हमारे पौराणिक आख्यानों को आधुनिक परिप्रेक्ष्य में विश्व के समक्ष प्रस्तुत किया। पद्मश्री से सम्मानित श्री कोहली के परिवार और पाठकों के प्रति मेरी शोक संवेदना।
— President of India (@rashtrapatibhvn) April 17, 2021
ఆర్.ఎస్.ఎస్ సంతాపం
ప్రఖ్యాత సాహిత్యవేత్త శ్రీ నరేంద్ర కోహ్లీ మరణించిన విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ శ్రీ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ పరమ పూజ్యనీయ శ్రీ దత్తాత్రేయ హొసబలే గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీ నరేంద్ర కోహ్లి గారి రచనలు భారతీయ సాహిత్య ప్రపంచానికి మూలంగా ఉండేవని వారు పేర్కొన్నారు. కోహ్లీ గారి వంటి కవి తన రచనల ద్వారా ఈ దేశ వారసత్వం, గొప్ప సంప్రదాయాలను సమకాలీన సందర్భంలో నిర్వచించారని పేర్కొన్నారు. హిందీ సాహిత్యంలో ఆయన కొత్త కొత్త ప్రయత్నాలు, ఆవిష్కరణలు చేశారని పేర్కొన్నారు. ఆయన మరణంతో హిందీ సాహిత్యంలో ఒక శకం ముగిసిందని వారు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
“प्रसिद्ध साहित्यकार श्री नरेंद्र कोहली जी ऐसे शब्दयोगी थे जिन्होंने अपनी लेखनी के माध्यम से इस माटी की विरासत और समृद्ध परम्पराओं को युगानुकूल सन्दर्भ में परिभाषित किया।”
श्री नरेंद्र कोहली जी के दुःखद निधन पर परमपूजनीय सरसंघचालक और माननीय सरकार्यवाह जी का शोक सन्देश : pic.twitter.com/2hI1M9SusB
— RSS (@RSSorg) April 17, 2021
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’