సీఎం కేసీఆర్ భైంసాలో పర్యటించి అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించకపోతే తానే భైంసాలో భరోసా యాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. భైంసాలో ఎంఐఎం గూండాల దాడిలో గాయపడి.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. భైంసా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
‘భైంసా బాధితుల పరిస్థితి హృదయవిదారకరం. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి వర్గాలతో చర్చించాను. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాలో హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నడు. కనీసం ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ కూడా బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓటుబ్యాంకు రాజకీయం చేస్తూ హిందువులపై దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం అని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? అని ప్రశ్నించారు. బైంసా ఘటన పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని స్పష్టం చేశారు.
బిజెపి స్పందించడం వల్లే బాధితులకు ప్రాణాపాయం తప్పిందని సంజయ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ స్పందించలేదని ప్రశ్నించారు. జర్నలిస్టులు విజయ్, దేవారెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెబుతూ భైంసాలో ప్రత్యేక చట్టం ఏదైనా అమలు చేస్తున్నారా? అని విస్మయం వ్యక్తం చేశారు.
More Stories
కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు