తగ్గుతున్న నిరుద్యోగం… మెరుగవుతున్న ఆర్ధికం 

సెంటర్ ఫర్ మానిటరింగ్ (సిఎంఐఇ) డేటా ప్రకారం దేశ నిరుద్యోగిత రేటు గత ఏడాది డిసెంబర్‌లో 9.1 శాతం నుండి 6.5 శాతానికి పడిపోవడం దేశంలో ఆర్ధిక పునరుద్ధరణను సూచిస్తున్నది.

డేటా మానిటరింగ్ థింక్ ట్యాంక్ ప్రకారం, గ్రామీణ నిరుద్యోగం జనవరిలో 9.15 శాతం నుండి 5.83 శాతానికి పడిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో 388.8 మిలియన్లతో పోలిస్తే జనవరిలో సుమారు 12 మిలియన్ల మంది అదనపు ఉద్యోగులు 400.7 మిలియన్లకు చేరుకున్నారని సిఎంఐఇ తెలిపింది.

మార్చి 2020 లో కోవిడ్ -19 ప్రేరిత లాక్ డౌన్  విధించినప్పటి నుండి ఇది అత్యధికం. ముఖ్యమైన అంశం ఏమిటంటే జనవరిలో  ఉపాధి ధోరణి పెరుగుదల అంతకు ముందు మూడు నెలల్లో నష్టాన్ని భర్తీ చేసింది.

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం యొక్క సంకేతాలను చూపిస్తున్నప్పటికీ భయాలు అలాగే ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో తాజా కొరోనావైరస్ కేసులు పెరగడంతో పాటు మరికొన్నింటితో, మహమ్మారి రెండవ తరంగానికి సంబంధించిన ఆందోళనలు మొదలయ్యాయి.

మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్,  పంజాబ్ నుండి వచ్చే ప్రయాణికులు కరోనావైరస్ పరీక్ష చేయించుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. “కొంత భయం ఉందని మేము అర్థం చేసుకున్నాము.  కాని సమావేశాలు, కదలికలపై కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ లోక్ డౌన్  ఉండదు” అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

వ్యాక్సిన్ లభ్యత కారణంగా, గత సంవత్సరం మాదిరిగా కరోనా వ్యాప్తి  సాధారణ జీవితం,  వ్యాపారాన్ని ప్రభావితం చేసే అవకాశం లేదని ఒక విశ్లేషకుడు గుర్తించారు. “మాకు ఇప్పుడు టీకాలు ఉన్నాయి. కాబట్టి ఇది గత సంవత్సరం నుండి చాలా భిన్నమైన పరిస్థితి..భయాన్ని  వ్యాప్తి చేయడంలో అర్థం లేదు, ”అని పేర్కొన్నారు.

భారతదేశంలో సుమారు 11 కోట్ల మంది ఉద్యోగులున్న ఎంఎస్‌ఎంఇ రంగం ఉద్యోగ కల్పనకు కీలకమైనది. ఆర్థిక పునరుజ్జీవనం కోసం ఇది కీలకం.  ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ఆర్థిక సంకోచం, రెండవ త్రైమాసికంలో 7.5 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుంది.