విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సమున్నత లక్ష్యంతో అభివృద్ధి చేశారని ప్రధాని మోదీ చెప్పారు. లోబడి ఉండాలనే సంకెళ్ళ నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆధునికీకరించడం లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లక్ష్యం కూడా పాత సంకెళ్ల నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడమేనని మోదీ చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగలిగే స్వేచ్ఛను నూతన విద్యా విధానం ఇస్తుందని తెలిపారు. స్వయం సమృద్ధ భారత దేశం వైపు వేసిన గొప్ప ముందడుగు నూతన జాతీయ విద్యా విధానమని పేర్కొన్నారు. పరిశోధన, నవకల్పనలకు ఈ విధానం శక్తినిస్తుందని చెప్పారు.
2021 కేంద్ర బడ్జెట్లో జాతీయ పరిశోధన ఫౌండేషన్ ద్వారా రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. పరిశోధన ఆధారిత అధ్యయనం కోసం రానున్న ఐదేళ్ళలో ఈ సొమ్మును ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందని పేర్కొంటూ మేధస్సులో సకారాత్మక, నకారత్మక రెండు ఆలోచనలూ ఉంటాయని, రెంటికీ తగ్గ దారులూ ఉంటాయని, అయితే ఏ వైపుగా వెళితే సమస్య తీరిపోతుందన్న దానిపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
దిలీప్ ఘోష్, సుప్రియ వాఖ్యలపై ఈసీ నోటీసులు
కేజ్రీవాల్ కు హైకోర్టు తాత్కాలిక బెయిల్ నిరాకరణ