అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

మరో వారం రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి దిగిపోనున్న వేళ అభిశంసనకు గురై రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.  క్యాపిటల్‌ హిల్‌ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
ట్రంప్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన 25వ సవరణను ప్రతిపాదించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ ఓ తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. ట్రంప్‌నకు ఉద్వాసన పలకడానికి ఈ సవరణను ఉపయోగించేందుకు కేబినెట్‌ను సమీకరించాలని పెన్స్‌ను ఇందులో కోరారు.
ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన 10 మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు గైర్హాజరయ్యారు. నలుగురు ఇండో అమెరికన్‌ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు.  గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జోబైడ్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు ఈ నెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు భవనాన్ని చుట్టుముట్టడంతో పాటు సమావేశంలోకి దూసుకువెళ్లారు.

ఈ సందర్భంలో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగానే తన మద్దతుదారులను రెచ్చగొట్టారంటూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చారు. ప్రతినిధుల సభలో 232-197 కోట్ల తేడాతో తీర్మానం నెగ్గడంతో అభిశంసనకు గురయ్యారు.

ఈ తీర్మానాన్ని సెనెట్‌కు పంపనున్నారు. కాగా, తీర్మానానికి సొంత పార్టీ (రిపబ్లికన్‌ పార్టీ)కి చెందిన పది మంది సభ్యులు మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో ఓటింగ్‌లో నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు పాల్గొనలేదు. అభిశంసనకు మద్దతు తెలుపుతూ నలుగురు ఇండో అమెరికన్‌ సభ్యులు ఓటు వేశారు.

అభిశంసనపై తీర్మానంపై సెనేట్‌ విచారణ జరిపి, ఓటింగ్‌ నిర్వహించనుంది. ఇందులో ఆమోదం పొందితే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ దిగిపోనున్నారు.సెనేట్‌ ఆమోదం పొందడానికి డెమొక్రాట్లకు మరో 17 ఓట్లు అవసరం. సెనేట్‌ విచారణలో దోషిగా తేలితే 2024 లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అడ్డుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. జనవరి 20న బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం ట్రంప్‌పై విచారణ కొనసాగనుంది. అయితే 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం  ప్రవేశపెట్టారు.

25 రాజ్యంగ సవరణ చట్టం కింద ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌లోని మెజారిటీ సభ్యులు తీర్మానించడం ద్వారా అధ్యక్షుడిని తొలగించే వీలుంది. సోమవారమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా, రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. 25 సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ ఉపాధ్యక్షుడు పెన్స్‌ ఇదివరకే సంకేతాలిచ్చారు.

అయినా సరే స్పీకర్‌ పెలోసీ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. అయితే తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు పెన్స్‌ తోసిపుచ్చారు. దీంతో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సోమవారం ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ సాగింది. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని పలువురు సభ్యులు ఓటేయడంతో అభిశంసనకు గురయ్యారు.

తీర్మానానికి ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. గత ఏడాదిలో డిసెంబర్‌లో ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రతిపక్ష డెమొక్రాట్‌ పార్టీ సభ్యులు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు ట్రంప్‌కు మద్దతు తెలుపడంతో.. తీర్మానం వీగిపోయింది.