ముంబై పోలీస్ కమిషనర్‌పై రూ. 200 కోట్ల దావా

టీఆర్పీ స్కామ్ లో ఆరోపణలు చేసిన ముంబై పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ పై రిపబ్లిక్ టీవీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్ గోస్వామి ప్రకటించారు. 

టీఆర్పీ కేసులో రిపబ్లిక్ టీవీ పేరు లేదని సోమవారం బాంబే హైకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల తరపు లాయర్ చెప్పారని తెలిపారు. పరమ్ వీర్ సింగ్ ఆరోపణలతో తమకు సంబంధం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం బహిరంగ  కోర్టులో ఒప్పుకుందని చెప్పారు. 

రిపబ్లిక్ టీవీ టీఆర్పీ కోసం మాల్ ప్రాక్టీస్ చేయలేదని స్పష్టం చేశారు. దురుద్దేశంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే పరమ్ వీర్ సింగ్  రిపబ్లిక్ టీవీపై తప్పుడు ఆరోపణలు చేశారని గోస్వామి మండిపడ్డారు. 

తన ప్రతిష్టను దెబ్బ తీసినందుకు రూ.100 కోట్లు, రిపబ్లిక్  మీడియా నెట్ వర్క్ కు నష్టం కలిగించినందుకు మరో రూ  100 కోట్లు చెల్లించాలని దావా వేస్తామని వెల్లడించారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేసే పక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.