దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఉండే ‘‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్’’ వారణాసిలోని గంగానదిలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చేప వారణాశిలో గంగానదిలో కనిపించేసరికి సైంటిస్టులు సైతం షాక్ అయ్యారు.అంతేకాదు ఈ చేపవల్ల చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
శాస్త్రవేత్తలు పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో రెండవసారి కనిపించిన ‘‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్’’ గంగానదిలో డాల్ఫిన్లను కాపాడేందుకు ప్రత్యేక గంగా గార్డులు పనిచేస్తున్నారు.
ఈ చేప వల్ల డాల్ఫిన్లకు ప్రమాదకరమనీ, డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో ఇలాంటి చేప కనిపించడం ఇది రెండోసారి అని నమామీ గంగా ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ప్రహరి దర్శన్ నిషాద్ తెలిపారు. గతంలో ఓ సారి మొదటిసారి గంగానదిలో ఇటువంటి చేపే కనిపించింది.
ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వారు కనిపెట్టిన ఆ చేప బంగారు రంగులో ఉందని తెలిపారు. గంగానదిలో ఇప్పటికే ఇటువంటివి రెండు చేపలు కనిపించాయంటే..ఇంకా ఇటువంటివి చాలా ఉండే ఉంటాయనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవి పర్యావరణాన్ని నాశనం చేస్తాయని..గంగానదిలో ఎవరికైనా ఇలాంటి చేపలు దొరికితే… ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి నదిలో వదలొద్దని సమీపంలోని సంబంధిత అధికారులను తెలపాలని సైంటిస్టులు పదే పదే సూచించారు. ఈ చేపను ఎట్టి పరిస్థితుల్లోను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు.
సక్కర్ మౌత్ క్యాట్ఫిష్లు చాలా రంగుల్లో ఉంటాయని, ఇవి అమెజాన్ నది నుంచి గంగా నదిలోకి ఎలా వస్తున్నాయన్నది తేలాల్సిన ఉన్నదని చెబుతున్నారు.
More Stories
ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టలేం
సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్
అయోధ్య రామయ్యకు రేపే సూర్య తిలకం