ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, దీపికాపదుకొనే, సిమోన్ కంబాటాతోపాటు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు విచారణకు హాజరుకావాలని హీరోయిన్లను ఎన్సీబీ ఆదేశించింది.
నోటీసుల నేపథ్యంలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం గోవాలో ఉన్న దీపికాపదుకొనే లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కొత్త సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి
కేసు విచారణలో డ్రగ్స్ లింక్స్ వెలుగుచూస్తుండటంతో ఎన్సీబీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు మొదట రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
విచారణలో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను రియా వెల్లడించింది. తాను సీబీడీ ఆయిల్ ను నటి శ్రద్దాకపూర్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి..కొనుగోలు చేశానని టాలెంట్ మేనేజర్ జయ సాహా ఎన్సీబీ విచారణలో వెల్లడించిన సంగతితెలిసిందే.
మరోవైపు బాలీవుడ్ నటి దీపికాపదుకొనే, ఆమె మేనేజర్ కరిష్మా మధ్య డ్రగ్స్ సంబంధిత చాటింగ్ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది. ఈ డ్రగ్స్ కేసు జాబితాలో మరికొందరు బాలీవుడ్ తారల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బీటౌన్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది.
More Stories
అస్సాంలో ఎఎఫ్ఎస్పిఎ మరో ఆరు నెలలు పొడిగింపు
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు