విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు‌ షాక్!

హీరో, నిర్మాత, దర్శకుడు విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు‌ షాకిచ్చింది. విశాల్‌, డైరెక్టర్‌ ఎం.ఎస్‌.ఆనంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘చక్ర’. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలింఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్‌ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను దక్షిణాది  భాషల్లో ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాత విశాల్‌ నిర్ణయించుకున్నారు. 
 
అయితే ‘చక్ర’ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనందన్‌కు నోటీసులను జారీ చేసింది.  
విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన చిత్రం ‘యాక్షన్’‌. ఈ సినిమాకు రూ.44 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయట. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్‌ గ్యారెంట్‌ ఉండేలా అగ్రిమెంట్స్‌ రాసిచ్చాడట.
 కానీ యాక్షన్‌ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్లు మాత్రమే వసూలు చేశాయట. ఈ నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చేస్తానని అన్నాడట.
కానీ సినిమా తమ బ్యానర్‌లో చేయకుండా విశాల్‌ తన బ్యానర్‌లో చేసుకోవడమే కాకుండా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాడని,  విశాల్‌ తమకు రూ.8.29 కోట్లు బాకీ ఉన్నాడు కాబట్టి అది చెల్లించే వరకు విశాల్‌ ‘చక్ర’ సినిమా విడుదలను ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అధినేతలు కోర్టుకెళ్లారు. కేసును పరిశీలించిన ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది.