కరోనా టీకా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రూ. 3 వేల కోట్ల కార్పస్ ఫండ్తో ‘మిషన్ కొవిడ్ సురక్ష’ పేరిట ఓ ప్రత్యేక మిషన్ను చేపట్టనున్నట్టు తెలుస్తున్నది.
వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, సమర్థత, భద్రత, సరఫరా, అందుబాటు ధర తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ మిషన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టీకాలను అభివృద్ధి చేస్తున్న సంస్థలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు ఈ మిషన్ సాయపడుతుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. 12 నుంచి 18 నెలల కాల పరిమితితో ఉండే ఈ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో ఉంటుందని, అయితే ఈ మిషన్ ప్రస్తుతం ప్రతిపాదనలోనే ఉన్నదని వివరించారు.
మరోవంక, దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలు, ఉన్నత విద్యాశాఖ తమ వద్ద ఉన్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష యంత్రాలను సమీపంలోని జిల్లా దవాఖానలు, కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ల్యాబ్లకు అందజేయాలని యూజీసీ కోరింది. ఫలితంగా కరోనా కట్టడిలో భాగంగా టెస్టుల సంఖ్యను మరింత పెంచడానికి వీలవుతుందని పేర్కొన్నది.
More Stories
త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు
బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు