మహీంద రాజపక్స ట్విటర్ ద్వారా శ్రీలంక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎల్పీపీపై నమ్మకం ప్రదర్శించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ పదవీ కాలంలో ప్రజలు నిరుత్సాహానికి గురికాబోరని హామీ ఇచ్చారు.
తనపైనా, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపైనా, పోడుజన పార్టీపైనా నమ్మకం పెట్టుకుని, ఓట్లు వేసి, గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘సౌభాగ్య దక్కమ’ ఎన్నికల ప్రణాళికకు పెద్ద ఎత్తున ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎస్ఎల్పీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మహీంద రాజపక్సను అభినందించారు. భారత్-శ్రీలంక కలిసికట్టుగా అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ద్వైపాక్షిక సహకారం కోసం కృషి చేస్తూ, ఇరు దేశాల మధ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనిపై మహీంద రాజపక్స స్పందిస్తూ, తనకు ఫోన్ చేసి, అభినందించినందుకు మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారత దేశం, శ్రీలంక మిత్ర దేశాలని చెప్తూ, శ్రీలంక ప్రజల బలమైన మద్దతుతో, ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారాన్ని మరింత పెంచేందుకు కలిసి పని చేయాలని తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. మహీంద రాజపక్స 2005 నుంచి 2015 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పని చేశారు.
More Stories
ఐరాస సంస్కరణలకు అమెరికా మద్దతు
ఎడారి దేశం దుబాయ్లో కుండపోత వర్షం
అమెరికాలో భారతీయ విద్యార్థుల పట్ల దౌత్య కార్యాలయాల ప్రత్యేక శ్రద్ద