గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనాకు సరైన బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. ఆ దేశానికి చెందిన 59 యాప్ లను జూన్ 29న నిషేధించింది. భారత రక్షణ, సమగ్రత, భద్రతకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో వీటిపై నిషేధం విధించింది.
భారత్ నిషేధం విధించిన తర్వాత చైనా యాప్ లపై ఇతర దేశాలు కూడా నిషేధం విధించడం మొదలు పెట్టాయి. తాజాగా మరో రెండు చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది.
ట్విట్టర్, గూగుల్ కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్ లను భారత్ నిషేధించింది. ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి ఈ రెండు యాప్ లను తీసేయాలని ఆదేశించింది. మరోవైపు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా వీటిని తొలగించారు.
అంతేకాదు పబ్జీ యాప్ను కూడా తొలగించడానికి మోదీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీకి చెందిన మరో 275 యాప్లను కూడా కేంద్రం తొలగించాలనుకుంటున్నట్
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
దిలీప్ ఘోష్, సుప్రియ వాఖ్యలపై ఈసీ నోటీసులు
కేజ్రీవాల్ కు హైకోర్టు తాత్కాలిక బెయిల్ నిరాకరణ