ఎల్ఏసీ వెంబడి తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఇంటర్నేషన్ బార్డర్ (ఐబీ) వద్ద పాకిస్తాన్ ఏం చేస్తుందోనని ఎదురు చూశామని ఆయా వర్గాలు తెలిపాయి. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ఎలాంటి దుందుడుకు చర్చలకు పాల్పడలేదని సదరు వర్గాలు వెల్లడించాయి.
పాక్ మౌనం తమను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఎందుకంటే వాళ్లు ఎల్వోసీ దగ్గర ఉద్రిక్తతలకు పాల్పడలేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘చైనా మనల్ని లడఖ్లో ఉండేలా చేసి మరొక సెక్టార్ (ప్రాంతం)లో దాడులు చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏమైనా చేయొచ్చు. దీనికి ఎల్ఓసీ వెంబడి ఉన్న పాకిస్తాన్ చర్యలకు సంబంధం ఉంటుంది’ అని ఆ వర్గాలు వివరించాయి.
మరోవంక, చైనాకు చెందిన ప్రజా విముక్తి సేనలు వాస్తవాధీన నియంత్రణ రేఖ దగ్గర పరిస్థితిని తీవ్రతరం చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తూర్పు లడాఖ్లో దాదాపు 40వేల మంది సైనికులు అధునాతన ఆయుధాలతో మోహరించినట్లు తెలుస్తోంది.
భారత్ – చైనా సైనిక అధికారుల మధ్యలో కుదిరిన ఒప్పందాలను చైనా పాటించడం లేదని సైనిక వర్గాలు తెలిపాయి. “పరిస్థితులను తీవ్రతరం చేసే సంకేతాలను ఇస్తూనే ఉన్నారు. రక్షణ వ్యవస్థలు, ఆయుధాలతో ఉన్న 40వేల మంది సేనలను మోహరించారు” అని ఒక సైనిక అధికారి చెప్పారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు