భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం ప్రగతి భవన్లో సంతోషికి అందించారు.
సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు అండగా ఉండి సహకారం అందించాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మద్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్ను కోరుకోవాలని కేసీఆర్ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్లో స్థలం కేటాయించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
More Stories
తెలంగాణాలో ఇంటర్ ఫలితాల విడుదల
ఈదురు గాలులకే కుప్పకూలిన వంతెన
దుబ్బాకకు మోదీ నిధులపై రఘునందన్ రావు పుస్తకం