ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. సుమలత నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించి, కరోనా వైరస్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పిరావడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.
దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.
ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులకు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు సినిమాల్లో నటించిన సుమలత 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యా లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన విసయం తెలిసిందే.

More Stories
దక్షిణాది సీట్లు తగ్గుతాయనడం అసత్యం
చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడులో ఐఎస్ఐ హస్తం?
అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ