కోవిడ్ మరణాలు ఒక శాతం కన్నా తక్కువ ఉండాలి 

కరోనా వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య ఒక శాతానికి కంటే తక్కువగా ఉండేలా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు,వైరస్ వ్యాప్తి నివారణకు  ఢిల్లీ నుండి  వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను కనిష్ట స్థాయికి అనగా ఒక శాతానికి కంటే మించకుండా అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కరోనా లక్షణాలు గల వారికి వీలైనంత అధిక సంఖ్యలో  టెస్టులకు నిర్వహించాలని చెప్పారు.

అలాగే రెడ్ స్పాట్ లుగా మారేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన మార్గదర్శకాలను తుఛ: తప్పక పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.

ఇంటినుండి బయిటకు వచ్చినపుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ఖచ్చితంగా పాటించాలని చెబుతూ ఒకవేళ ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కరోనా వైరస్ నియంత్రణకు ఆరోగ్య సేతు యాప్ వినియోగం వంటి ఇతర సాంకేతిక విధానాలను పూర్తిగా వినియోగించుకోవాలని రాజీవ్ గౌబ సూచించారు. 

 
ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు మరోవైపు వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు,ఐసియు,వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 60శాతం పైగా కోలుకునే వారి సంఖ్య పెరిగిందని  చెబుతూ దీనిని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

 
ప్రస్తుతం దేశంలో రోజుకు 2.5 లక్షల కోలివుడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని చెబుతూ ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.  కరోనా కట్టడికై సేవలందిస్తన్న డాక్టర్లు, ఇతర సిబ్బందికై ఇప్పటికే 2కోట్లకు పైగా ఎన్-95 మాస్క్ లను పెద్ద సంఖ్యలో పిపిఈ కిట్లు సరఫరా చేయగా చెబుతూ మరిన్ని సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.