వీటిపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వ బలమైన నాయకత్వం ప్రశంసనీయమైనదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మరి తదుపరి దశను భారత దేశంతోపాటు చాలా ఇతర దేశాలు ఎదుర్కొంటున్నాయని, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి సారిచాలని సూచించింది.
భారత దేశం ప్రారంభం నుంచి చాలా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోందని చెబుతూ డబ్ల్యూహెచ్ఓ సిఫారసుల మేరకు జనవరి నుంచే కొన్ని చర్యలను అమలు చేసిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గత రెండు నెలల్లో టెస్టింగ్ కిట్ల విషయంలో భారత దేశం స్వయంసమృద్ధమైందనికొనియాడారు. ఇది గొప్ప విజయమని తెలుపుతూ భవిష్యత్తులో ఈ టెస్టింగ్ కిట్ల సంఖ్యను పెంచే సామర్థ్యం భారత దేశానికి ఉందని చెప్పారు.
అయితే డేటాపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉందని డాక్టర్ సౌమ్య సూచించారు. డేటాను పద్ధతి ప్రకారం పరిశీలించవలసి ఉంటుందని ఆమెపేర్కొన్నారు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చెప్పడం వల్ల కొన్ని వివరాలు మాత్రమే తెలుస్తాయని చెప్పారు.
డేటాను ఏ విధంగా రిపోర్టు చేయాలనేదానిపై జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం లేకపోతే వివిధ అంశాలను పోల్చి చూడటం సాధ్యం కాదని ఆమె చెప్పారు.
కోవిడ్-19పై మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల పట్ల కూడా భారత దేశం శ్రద్ధ చూపాలని డా. సౌమ్య సూచించారు. క్షయ వ్యాధి, సంస్థాగత ప్రసవాలు, ఎంపిక చేసుకున్న శస్త్ర చికిత్సలు వంటివి కోవిడ్ కన్నా తీవ్రమైనవని ఆమె పేర్కొన్నారు. వీటిపై కూడా భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలని చెప్పారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’