మల్కం చెరువు , మైసమ్మ గుడిలను కాపాడండి 

అభివృద్ధి పేరుతో హైదరాబాద్ నగరం రాయదుర్గ వద్ద గల  కట్టమైసమ్మ గుడిని తొలగించడం భావ్యం కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి ఇన్‌ఛార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. మల్కం చెరువును అభివృద్ధి పేరుతో పూడ్చే ప్రయత్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాహరు. ఆయన ఆ చెరువు వద్దకు వెళ్లి, స్థానిక ప్రజలను కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకున్నారు.

చెరువు కట్టపై ఉన్న వందల సంవత్సరాల నాటి మైసమ్మ గుడిని తరలించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతింటాయని సూచించారు.

చెరువు కట్టపై ఉండడంతో ఆ గుడిని కట్టమైసమ్మ అని పిలుస్తున్నారు. ఇప్పుడు కట్టపై నుండి తొలగించి, మరెక్కడో పెడితో అది పక్కోరు (మణికొండ జాగీరు) మైసమ్మ అవుతుంది గాని కట్ట మైసమ్మ ఎట్లాగూ అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్థానిక ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొనక పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కట్ట మైసమ్మ ఆ చెరువును, గ్రామాన్ని కాపాడుతుందని వందల ఏళ్లుగా స్థానికుల విశ్వాసం అని చెప్పారు. వారి విశ్వాసాన్ని గౌరవించాలని కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ కొత్తగా రహదారి అవసరమని స్థానికులు ఎవ్వరు కోరడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా శ్రద్ద ఉంటె చెరువు పూడికలు తీసివేసి, నీరు బాగా నిల్వ ఉండేటట్లు చేయాలని యోగానంద్ కోరారు.

హై కోర్ట్ ఆదేశానికి విరుద్ధంగా చెరువు కంచెను దూరంగా జరిపారని చెబుతూ దానిని యధాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ గ్రామంలో ఉన్న సుమారు 80 మత్స్యకారుల కుటుంబాలకు ఆ చెరువు చాలాకాలంగా జీవనోపాధి కల్పిస్తున్నది. ఇప్పుడు చెరువును పూడ్చివేసె పనులు చేస్తుండడంతో తాము ఉపాధి కోల్పోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వారి జీవనానికి ప్రభుత్వమే భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.

చెరువు వద్ద ఉన్న స్మశాన వాటికను తరలించే ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ ఎవ్వరి కోసం ఇవ్వన్నీ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. చెరువులో మార్పులు, చేర్పులు చేయడానికి, 100 అడుగుల రోడ్ వేయడానికి ఎవ్వరు అనుమతి ఇచ్చారో ముందుగా చెప్పాలి.  చెరువు అభివృద్ధి అంటూ ఏమైనా ప్రణాళిక వేసి, సంబంధిత శాఖల అనుమతి పొందారా? ఈ విషయమై ఏదైనా మాస్టర్ ప్లాన్ రూపొందించారా?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

చెరువు కట్టపై ఉండడంతో ఆ గుడిని కట్టమైసమ్మ అని పిలుస్తున్నారు. ఇప్పుడు కట్టపై నుండి తొలగించి, మరెక్కడో పెడితో అది పక్కోరు (మణికొండ జాగీరు) మైసమ్మ అవుతుంది గాని కట్ట మైసమ్మ ఎట్లాగూ అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్థానిక ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొనక పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కట్ట మైసమ్మ ఆ చెరువును, గ్రామాన్ని కాపాడుతుందని వందల ఏళ్లుగా స్థానికుల విశ్వాసం అని చెప్పారు. వారి విశ్వాసాన్ని గౌరవించాలని కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ కొత్తగా రహదారి అవసరమని స్థానికులు ఎవ్వరు కోరడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా శ్రద్ద ఉంటె చెరువు పూడికలు తీసివేసి, నీరు బాగా నిల్వ ఉండేటట్లు చేయాలని యోగానంద్ కోరారు.

హై కోర్ట్ ఆదేశానికి విరుద్ధంగా చెరువు కంచెను దూరంగా జరిపారని చెబుతూ దానిని యధాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ గ్రామంలో ఉన్న సుమారు 80 మత్స్యకారుల కుటుంబాలకు ఆ చెరువు చాలాకాలంగా జీవనోపాధి కల్పిస్తున్నది. ఇప్పుడు చెరువును పూడ్చివేసె పనులు చేస్తుండడంతో తాము ఉపాధి కోల్పోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వారి జీవనానికి ప్రభుత్వమే భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.

చెరువు వద్ద ఉన్న స్మశాన వాటికను తరలించే ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ ఎవ్వరి కోసం ఇవ్వన్నీ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. చెరువులో మార్పులు, చేర్పులు చేయడానికి, 100 అడుగుల రోడ్ వేయడానికి ఎవ్వరు అనుమతి ఇచ్చారో ముందుగా చెప్పాలి.  చెరువు అభివృద్ధి అంటూ ఏమైనా ప్రణాళిక వేసి, సంబంధిత శాఖల అనుమతి పొందారా? ఈ విషయమై ఏదైనా మాస్టర్ ప్లాన్ రూపొందించారా?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.