కరోనా వచ్చిన మంత్రులు గాంధీలో చేరరే

కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామన్న సీఎం కేసీఆర్ మీ మంత్రులెందుకు ప్రైవేటులో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి కరోనా వచ్చినా గాంధీ ఆస్పత్రే దిక్కుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
నిన్న హోం మంత్రి మహమూద్ అలీ కి , నేడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కరోనా వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేస్తామని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. 
 
ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించమని కూడా చెప్పారు. మరి మీ హోం మంత్రి మహమూద్ అలీ కి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఎలా చికిత్స తీసుకుంటున్నారు? 
 
అంటే మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల మీద వాళ్ళకి నమ్మకం లేనట్లే కదా? అందుకే మీ హోమ్ మంత్రి, మీ ఎమ్మెల్యే లు, యశోద ఆసుపత్రి, లేకపోతే అపోలో ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ గారు మీరు ఫాం హౌస్ నుండి లేదా మీ ఇంటి నుంచి ఒకసారి బయటికి వచ్చి, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించమని రాజా సింగ్ కోరారు. 
 
అప్పుడు అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి మీకు అర్థమవుతుందని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ ఉన్న రోగులను బాగా చూస్తున్నారు. వారికి  అన్ని వసతులు కల్పిస్తున్నారు.  
 
కానీ తెలంగాణ లో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే ఓకే ఒక్క ఆసుపత్రి ఉందని విచారం వ్యక్తం చేశారు.  పేదలు చనిపోతే కూడా మృతదేహం  దొరకని పరిస్థితి రాష్ట్రం లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.