తుచ్ఛ రాజకీయాలు చేస్తున్న రాహుల్ 

భారత్, చైనా వ్యవహారంలో దేశమంతా ఏకమై ఒకవైపు ఉంటే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం మరోవైపు ఉన్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు అమిత్ షా శనివారం ఓ ట్వీట్ చేశారు.

గల్వాన్ అంశం విషయంలో కేంద్రంపై గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ విమర్శలపై ఓ సైనికుడి తండ్రి మాట్లాడుతూ, గల్వాన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఓ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియోను అమిత్ షా తన ట్విట్టర్ లో పోస్టుచేస్తూ  ఓ సైనికుడి తండ్రి రాహుల్ గాంధీకి స్పష్టమైన సమాధానం ఇచ్చారని, ఇప్పటికైనా రాహుల్ గాంధీ విమర్శలు మానుకొని జాతీ ప్రయోజనాల కోసం పాటుపడాలని అమిత్ షా హితవు పలికారు.