
65 ఏళ్లుపైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని పేర్కొంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీచేసింది. లాక్డౌన్ 4.0 ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుతం లాక్డౌన్ 5.0 ను ఈ నెల 30 వరకు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని సడలింపులూ ఉంటాయని తెలిపింది.
రాయితీ ఈ విషయమై వారం రోజులవరకు మౌనంగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మార్గదర్శకాలు
* కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. ఆహారం పార్శిల్ తీసుకువెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* 65 ఏళ్లుపైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు.
* కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.
* షాపింగ్ మాల్స్లో ఎయిర్ కండీషన్ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషిద్ధం.
* అనుమతి ఉన్న షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
* షాపింగ్ మాల్స్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
* ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
* హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతిసారీ శానిటైజ్ చేయాలి.
* గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసి ఉంచాలి.
* షాపింగ్ మాల్స్లోని సినిమా హాళ్లు తెరవకూడదు.
దేవాలయాల్లో
* దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలకు అనుమతి.
* ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై కొనసాగనున్న నిషేధం.
* దేవాలయాల వద్ద విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకోవాలి.
* తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధం.
* సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
* ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కింద కూర్చునే వస్త్రం లేదా తివాచీ తెచ్చుకోవాలి.
More Stories
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
సర్వర్ల డౌన్ తో ఏపీలో నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు
రూ.793 కోట్ల మార్గదర్శి ఆస్తులు అటాచ్!